అనంతపురం జిల్లా శెట్టూరు కరిడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు పిల్లలు చనిపోయారు. వీళ్లిద్దరూ అన్నదమ్ములు. చెరువుగట్ట వద్ద టాయిలెట్కు వెళ్లిన 9 ఏళ్ల బాలు చెరువులో జారిపోయాడు. తమ్ముడ్ని కాపాడే ప్రయత్నంలో 12 ఏళ్ల బన్నీ కూడా చెరువులో జారిపడిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.