ఇసుక కొరతపై ఏపీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇసుక క్వారీలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా CITU ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలియాత్ర చేపట్టారు. క్వారీలను మూసేయడంతో లక్షలాది కార్మికులు రోడ్డునపడ్డారని కార్మిక సంఘం నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా పని బంద్ చేసి, విజయవాడలో మహాప్రదర్శన నిర్వహించనున్నారు.