నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలిస్తే.. రాష్ట్రానికి అరిష్టమంటున్నారు కొందరు స్వామీజీలు. 15 వేల గ్రామాల్లో.. గ్రామదేవతలను పూజించి... అక్కడి నుంచి తీసుకొచ్చిన పుట్టమన్ను, పవిత్ర జలాలతో అభిషేకించిన ప్రాంతాన్ని మార్చడం తగదని చెప్తున్నారు. పైగా.. అమరావతికి శంకుస్థాపన రోజున సుదర్శనయాగం వంటి క్రతువులు శాస్త్రోక్తంగా జరిగిన విషయాన్ని స్వామీజీలు గుర్తుచేస్తున్నారు. అలాంటి నగరాన్ని తరలిస్తే.. రాష్ట్రానికి అరిష్టమని చెప్తున్నారు.