బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో భారీ చోరీ జరిగింది. బిల్డర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 4 కోట్ల విలువైన సొత్తు చోరీ చేశారు దుండగులు.. యజమాని ఇంట్లో ఉన్న సమయంలోనే నగదు, వజ్రాలు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు..