రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరునకు నిరసనగా చంద్రబాబు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనకుండా చంద్రబాబు సహా పలువురు నేతలను గృహనిర్బంధం విధించారు పోలీసులు. దీంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునకు నిరసనగా, బాధితులకు సంఘీభావంగా ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8 గంటలవరకు నిరాహారదీక్ష చేపట్టారు చంద్రబాబు. నాయకులంతా శాంతియుతంగా ఎక్కడికక్కడ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.