ఆంధ్రప్రదేశ్లో టీవీ5 ప్రసారాలు నిలిపివేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సర్కార్ వైఫల్యాల్ని ప్రజలకు తెలియచేస్తున్నందుకు ఇలా చేయడం తగదన్నారు. MSOలపై ఒత్తిడి తెచ్చి కేబుల్లో టీవీ5 ప్రసారాలు నిలిపివేయడం దారుణమని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. మీడియా గొంతు నొక్కడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనన్నారు.