తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్

Update: 2019-09-17 05:05 GMT

తెలంగాణ భవన్‌లో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తూ అమరవీరుల్ని స్మరించుకున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తోంది TRS. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో KTRతోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అటు, విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుందాం.. జై తెలంగాణ.. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.

Also watch :

Full View

Similar News