Road Accident: నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన పుట్టినరోజు వేడుక

బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం

Update: 2024-04-29 04:15 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో కొమ్మాబత్తుల జతిన్ అనే యువకుడు గత అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీ ఇచ్చాడు. అనంతరం జతిన్, వేడుకకు హాజరైన అతడి స్నేహితులు తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తుండగా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో అది ఓ లారీని ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన మరో నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకులు అందరూ అర్ధరాత్రి వరకు యానాంలో బాగా మద్యం సేవించి ఆటోలో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

కాగా, మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారికి చికిత్స నిమొత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ప్రమాదంలో సాపే నవీన్ నగరం,  కొల్లాబత్తుల జతిన్ , నల్లి నవీన్ కుమార్ , వల్లూరి అజయ్ మృతిచెందినట్టుగా గుర్తించారు.. ఒక బర్త్‌డే వేడుక.. నాలుగు కుటుంబాల్లో విషాధాన్ని నింపినట్టు అయ్యింది.

Tags:    

Similar News