ఒకప్పుడు మొబైల్ రంగంలో సంచలనాలు సృష్టించిన మోటోరోలా మళ్లీ ఫామ్లోకి వచ్చింది. తాజాగా మోటో ఈ6ఎస్ పేరుతో కొత్తగా స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. రూ.7,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్ఫోన్ విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఈ ఫోన్ కొన్న వారికి జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్బ్యాక్, రూ.3,000 ఓచర్లు కూడా లభించనున్నాయి. మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్. ఆండ్రాయిడ్ వన్ సిరీస్ తరహా ధరలోనే ఈ మోటో ఈ6ఎస్ కూడా లభిస్తుంది. ఇక ఈ ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 23న ప్లిప్కార్ట్లో ప్రారంభమవుతాయి.
ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. *6.1 అంగుళాల హెచ్డీ+డిస్ప్లే * 4 జీబీ ర్యామ్ *64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ *మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ *13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా *8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా *3000 ఎంఏహెచ్ బ్యాటరీ * ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ * డ్యూయెల్ సిమ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించనుంది.