అమీర్ పేట్ మెట్రో ప్రమాదంపై వివరణ ఇచ్చిన అధికారులు

Update: 2019-09-22 13:43 GMT

హైదరాబాద్ లోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ కూకట్‌పల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. ఈ మృతి ఘటనను మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి ధృవీకరించారు. మృతి చెందిన మౌనిక టిసిఎస్ కంపెనీలో పని చేస్తోందని తెలిపారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తునుంచి పదునైన పెచ్చులు పడిపోవడంతో ఆమె మృతి చెందిందని వివరణ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తామని ఎల్ అండ్ టి అధికారులు ప్రకటించారు.

Also watch :

Full View

Similar News