ప్రభుత్వ అధికారిక లాంచనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

Update: 2019-09-22 14:53 GMT

చిత్తూరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు, విలక్షణ నటులు నారమల్లి శివప్రసాద్‌ అంత్యక్రియలు ముగిశాయి. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఆయన పార్ధీవదేహాన్ని ఖననం చేశారు. ప్రభుత్వ అధికారిక లాంచనాలతో.. శివప్రసాద్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.

అంతకు ముందు తిరుపతి నుంచి ఆయన స్వస్థలం చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి సమీపంలోని అగరాల వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శివప్రసాద్‌ అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు. శివప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. శివ ప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు చంద్రబాబు.

Also watch :

Full View

Similar News