అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర పెచ్చులు పడి మృతి చెందిన మౌనిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో మౌనిక మృత దేహానికి గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తన భార్య మృతదేహాన్ని చూసి భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు..
ఇప్పటి వరకు మెట్రో అధికారులు ఎవరూ తమ వద్దకు రాలేదన్నారు హరికాంత్ రెడ్డి. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. మౌనిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు.