పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ప్రధాన డ్యామ్, జల విద్యుత్ కేంద్రాల టెండర్ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు రూ. 4 వేల 987 కోట్లను ఇనిషియల్ బెంచ్ మార్కు విలువగా ప్రభుత్వం నిర్ణయించింది. మేఘా సంస్థ 12.6 శాతం తక్కువకే కోట్ చేసింది. రూ. 4 వేల 358 కోట్లకు కోట్ చేసి L-వన్గా నిలిచింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్లు లబ్ది చేకూరినట్టయింది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా సంస్థ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టనుంది.
Also watch :