RTA అధికారులు, పోలీసులు వేధిస్తున్నారా అయితే.. ఆటోలపై సీఎం జగన్ ఫోటోలు పెట్టుకోండని ఉచిత సలహా ఇచ్చారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. వాహనమిత్ర పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో తిరిగేవారి కంటే ఆటోల్లో తిరిగేవాళ్లే తమకు ముఖ్యమన్నారు అవంతి శ్రీనివాస్.