ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ఎవరికీ సంతృప్తి లేకుండా పోయిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అన్నవారే ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. కూలీల నుంచి కాంట్రాక్టర్ల వరకు ఎవరికీ కుటుంబం గడిచే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు గట్టిగా బుద్ధిచెబుతారని విష్ణుకుమార్ రాజు విశాఖలో అన్నారు.