అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హైదరాబాద్ నాగోల్లోని సాయినగర్లో నివాసముండే వనితకు శివకుమార్ అనే వ్యక్తితో గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అనంతరం భర్తతో విభేదాలు, అత్తింట్లో వేధింపులు తాళలేక హైదరాబాద్లోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. అయితే.. గత జులైలో అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్న భర్త వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులతో వనిత కాంటాక్ట్లో లేదు. హఠాత్తుగా వనిత మృతి చెందిందంటూ తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కూతురి మరణానికి భర్త, అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కరోలినా పోలీసులు మృతురాలి భర్త శివకుమార్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.