బెజవాడలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ఫోర్స్ పోలీసులు. నగరంలోని కార్పొరేట్ విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ సరఫరా సాగుతోంది. గతకొంతకాలంగా కలకలం సృష్టించిన డ్రగ్ మాఫియాపై పోలీసులు నిఘా ఉంచారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను అరెస్ట్ చేసి.. వారి దగ్గర నుంచి 3 కేజీల గంజాయి, 14 గ్రాముల డయాక్సి అనే మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు. విష సంస్కృతి విజయవాడకు పాకడంతో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.