హుజూర్నగర్లో గురువారం తలపెట్టిన సీఎం కేసీఆర్ ప్రచార సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా.. సభను రద్దు చేశారు. హూజూర్నగర్లో ప్రస్తుతం కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సభా ప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీఆర్ఎస్.