ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎవరికి తలవంచననన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రకాశం జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు. ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తాను బెదిరిపోయేవాడిని కాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ఎన్నో పొగొట్టుకున్నానని తెలిపారు. ఒక ఎన్నికల్లో ఓడిపోతే.. వెళ్లిపోయే నాయకులు తనకు వద్దన్నారు. తనతో పాటు 25 ఏళ్లు ఉండే నాయకులు కావాలన్నారు పవన్ కల్యాణ్. గెలిచినా ఓడినా.. ప్రజల అండదండలతో ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానన్నారు పవన్.