హైదరాబాద్లో అర్ధరాత్రి నడి రోడ్డుపై ఓ కొండచిలువ హల్చల్ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో కొండచిలువను గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు స్నేక్ సొసైటీ సభ్యులను పిలిపించారు. కొండచిలువను సంచిలో బంధించి కేబీఆర్ పార్కులో వదిలిపెట్టారు.