భారీ అధిక్యంతో సైదిరెడ్డి విజయం ఖాయం..

Update: 2019-10-24 08:03 GMT

హుజూర్‌నగర్‌లో కారు టాప్‌గేరులో దూసుకెళ్తోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే గులాబీ గుబాళింపులు మొదలయ్యాయి. తొలి రౌండ్ నుంచే TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఈ జోరు చూస్తుంటే..హుజూర్‌నగర్ ఓటర్లంతా ఏకపక్షంగా ప్రభుత్వం వైపే నిలబడినట్లు స్పష్టం అవుతోంది. 14వ రౌండు ముగిసే సరికి దాదాపు 27 వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉంది టీఆర్ఎస్. ఈ ట్రెండ్ చూస్తుంటే సైదిరెడ్డి భారీ అధిక్యంతో విజయం సాధించడం దాదాపు ఖాయమైపోయింది. గెలుపు లాంఛనమే కాకవడంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

హుజూర్‌నగర్‌ నగర్ కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ హస్తం హవా నడుస్తోంది..వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ నుంచి..ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేస్తే.. TRS నుంచి సైదిరెడ్డి బరిలోకి దిగారు. గతంలో పలుమార్లు ఓటమి పాలయ్యారన్న సింపతీతోపాటు, KCR మార్క్ మ్యాజిక్ కూడా వర్కౌట్ కావడంతో హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది...

మొదటి నుంచి ఊహించినట్లే హుజూర్‌నగర్‌లో టీడీపీ, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.. రెండు పార్టీలకు కనీసం డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా కనిపించడం లేదు... మొదటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్‌ మధ్యే హోరాహోరీగా పోరు నడిచింది. ఇక ఆర్టీసీ సమ్మె కూడా ఈ ఉపఎన్నికపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఓటర్లు ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు.

Similar News