ఆర్టీసీ డిమాండ్లపై సీఎం కేసీఆర్కు ఈడీల కమిటీ నివేదిక అందింది. ఈ నివేదికపై కేసీఆర్ సమీక్షిస్తున్నారు. 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై ఈడీల కమిటీ రిపోర్ట్ తయారు చేసింది. కేసీఆర్ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్, ఆరుగురు ఈడీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అటు.. 28న హైకోర్టు ముందుకు ఈ కమిటీ నివేదిక రానుంది.