విశాఖలోని భాను స్ట్రీట్లో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో మంటల్ని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్కూల్ని నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులే స్కూల్ రూఫ్ పైకి ఎక్కి మంటల్ని అదుపుచేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.