వైసీపీలో పర్చూరు లొల్లి పీక్ స్టేజ్కి చేరింది. పర్చూరు బాధ్యతలను రావి రామనాథం బాబుకు ఇవ్వొద్దని వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దగ్గుబాటి.. లేదంటే గొట్టిపాటికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని అధినేతకు తెలియజేసేందుకు వందలాది కార్లలో తాడేపల్లి చేరుకున్నారు. పర్చూరు పంచాయితీకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.