సీబీఐ కోర్టులో జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరువుతున్న జగన్.. ఏపీ సీఎంగా పరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందని.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఐతే.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు జగన్ పిటిషన్ను డిస్మిస్ చేసింది.