నెల్లూరు జిల్లాలో తమిళ జాలర్లకు, స్థానిక మత్స్యకారులకు మధ్య వివాదం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 1న ఏపీ సముద్ర ప్రాంతంలో చేపలవేట సాగిస్తున్న తమిళుల్ని స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తమిళ మత్స్యకారులపై దాడి జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. బోటు తీరానికి చేరిన సమయంలో వాళ్లను స్థానికులు తీవ్రంగా కొట్టారు. 8 రోజులుగా తమిళ జాలర్లంతా కావలి రూరల్ పీఎస్లోనే ఉన్నారు.