గుంటూరు తూర్పు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి చెరుకువాడ రంగనాథరాజు. స్పందన కార్యక్రమంలో రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.