న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం : సున్నీ వక్ఫ్‌ బోర్డు

Update: 2019-11-09 12:18 GMT

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు సుదీర్ఘమైన తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్టుకు అప్పగించాలని స్పష్టంచేసింది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు తెలిపింది. తీర్పు కాపీ అందిన తర్వాత.. దానిపై చర్చించి.. రివ్యూ పిటిషన్‌ వేయాలో, వద్దో నిర్ణయం తీసుకుంటామని బోర్డు తరఫు న్యాయవాది జిలానీ తెలిపారు. అయితే.. రివ్యూ పిటిషన్‌ అవసరం లేదనే నిర్ణయానికి సున్నీ వక్ఫ్‌ బోర్డు వచ్చినట్టు సమాచారం.

Similar News