మానవత్వం మంటగలిసిన ఘటన విజయవాడలో జరిగింది. 4 నెలల ఆడ శిశువును బందర్ రోడ్డులోని నిర్మల శిశుభవన్ గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో పెట్టి వదిలివెళ్లారు. పాప ఏడుపు విని శిశుభవన్ నిర్వాహకులు గేటు తీశాక అట్టపెట్టెలో ఉన్న శిశువుని చూసి షాకయ్యారు. పాపను ఎవరు వదిలిపెట్టి వెళ్లారో తెలియలేదు. నెలల పాప నీరసంగా ఉండటంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చి నిర్మల శిశుభవన్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు.