కాలినడకన అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎంపీ వంగా గీత

Update: 2019-11-11 07:57 GMT

కాకినాడ ఎంపీ వంగా గీత కాలినడకన వెళ్లి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి కాలినడకన అన్నవరం బయలుదేరారు. ఆమె పాదయాత్రకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ సంఘీభావం తెలిపారు.

జగన్‌ సీఎం అయితే అన్నవరం నడిచి వస్తానని మొక్కుకున్నట్టు వంగా గీత తెలిపారు. అందులో భాగంగానే అన్నవరం నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు తొలిగి అభివృద్ధి, సంక్షేమంలో పెద్దపీట వేసేలా స్వామి ఆశీస్సులు అందజేయాలని కోరినట్లు తెలిపారు.

Similar News