విశాఖలో నేరాల సంఖ్య 50 శాతం తగ్గిందన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. క్రైమ్రేట్ తగ్గించడంలో సక్సెస్ అయినందుకు సీపీ మీనాను అభినందిస్తున్నాని చెప్పారు. స్పందన కార్యక్రమంతో సమస్యలు బాగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. విశాఖ నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతోందని...ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు డీజీపీ.