వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఇది చేతకాని ప్రభుత్వమంటూ ధ్వజమెత్తారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి 10 వేలు ఇచ్చి ఆదుకోవాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు లోకేశ్.