ఇసుకలో అవినీతి చేస్తున్నానంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. దమ్ముంటే అవినీతిని నిరూపించాలని సవాల్ చేశారు. అవినీతికి తావు లేకుండా సీఎం జగన్ నూతన ఇసుక విధానం రూపొందించారని అన్నారు ధర్మాన కృష్ణదాసు.