విలీనం విషయంలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గినందున.. మిగిలిన డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరించాలన్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఆర్టీసీ కార్మికులు సైతం తెలంగాణ బిడ్డలేనన్నారాయన. కార్మికుల డిమాండ్లన్నీ సహజమైనవేనన్న ఆయన.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సీఎం కేసీఆర్కు తగదన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ప్రణాళిక ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.