ఏపీ రెండు కళ్లైన పోలవరం, అమరావతిలను పొడిచేశారని టీడీపీ రాజసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ వల్ల లాభం రాకపోగా సుమారు 5 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తామన్న మోదీ ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. బొత్స వ్యాఖ్యలతో పెట్టుబుడిదారులు వెనక్కి వెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఇసుక సమస్యను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై దృష్టిపెట్టిందన్నారు.