సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వైసీపీలో చేరానన్నారు దేవినేని అవినాష్. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు అవినాష్. అందరినీ కలుపుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. పార్టీలో చేరడానికి సహకరించిన పెద్దలందరికీ ధన్వాదాలు తెలిపారు అవినాష్.