ఏపీలో గంజాయి ముఠా గుట్టు రట్టు..

Update: 2019-11-21 03:31 GMT

ఏపీలో గంజాయి దందా ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకులను, ఇద్దరు మహిళలను గుంటూరు అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన పఠాన్‌ అహ్మద్‌, నల్లబెల్లి భారత్‌ కృష్ణ, నల్లగట్ల రామగోవిందరెడ్డి అనే యువకులను అరెస్ట్‌ చేశారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని.. గంజాయి విక్రయిస్తే నాన్‌ బెయిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ.

Similar News