రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అవుటర్ రింగురోడ్డు దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తుక్కుగూడ అవుటర్ ఎగ్జిట్ 14 తాండూర్ నుండి కల్వకుర్తికి గ్రానైట్ మార్బుల్లోడ్తో వెళ్తున్న DCMకు ఒక్కసారిగా బ్రేక్లు ఫెయిలవ్వడంతో పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొంది. డీసీఎంలో ఐదుగురు ఉండగా.. ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు.. క్షతగాత్రులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు.