మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. దీంతో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు.. అలాగే డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు.