చింతల్‌లో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కి కరెంట్‌ పోల్‌ను ఢీకొని..

Update: 2019-11-24 06:13 GMT

హైదరాబాద్‌లోని చింతల్‌లో షా థియేటర్‌ వద్ద భారీ ప్రమాదం తప్పింది. సిటీ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిటీ బస్సు గండిమైసమ్మ చౌరస్తా నుంచి సికింద్రాబాద్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

షా థియేటర్‌ వద్ద అప్పటికే రోడ్డుపై ఒక ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఆ రెండు వాహనాలు రోడ్డుపై ఉండగానే... వెనక నుంచి సిటీ బస్సు వేగంగా వచ్చింది. టెంపరరీ డ్రైవర్‌ ప్రతాప్‌ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు మధ్యనున్న డివైడర్‌పైకి ఎక్కించాడు. దీంతో డివైడర్‌పైకి ఎక్కిన బస్సు కరెంట్‌ పోల్‌ను ఢీకొని నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కాసేపు ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో పోలీసులు వచ్చి క్లియర్‌ చేశారు.

Similar News