దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలపై కేంద్రం క్లారిటీ

Update: 2019-11-27 14:15 GMT

దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. ఇంతకు ముందు హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో దీనిపై స్పష్టత ఇవ్వాలని కేవీపీ కోరడంతో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది.

Similar News