ఉల్లి ధర కొండేక్కింది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి వంద రూపాయలు చేరింది. దీంతో తెలంగాణ మార్కెటింగ్ శాఖ... కిలో 40 రూపాయలు అమ్మాలని నిర్ణయించింది. ఈ మేరకు మెహదీపట్నం, సరూరనగర్ రైత బజార్లో సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరుకు అమ్మకాలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనం ఉల్లి కోసం క్యూలో నిలబడ్డారు. కానీ.. గంటల తరబడి క్యూలో నిలబడినా.. ఉల్లి అమ్మకపోవడంతో ఆగ్రహించారు. అధికారుల్నీ నిలదీశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.