చంద్రబాబు కాన్వాయ్పై చెప్పులు, రాళ్లతో దాడి చేసిన ఘటనలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. చెప్పులు విసిరిన వ్యక్తి తాను ఓ రైతుగా చెబుతున్నాడని వెల్లడించారు. రాళ్లు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినట్టు చెబుతున్నాడన్నారు. చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని వారు చెబుతున్నారన్నారు.. ఎవరి భావ స్వేచ్ఛ ప్రకటించే హక్కు వారికి ఉందని.. నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా అందరికీ ఉందన్నారు డీజీపీ.