ప్రియాంకారెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పురోగతి కనిపిస్తోంది. రేప్ చేసి మర్డర్ చేసినట్లు గుర్తించారు పోలీసులు..శంషాబాద్ టోల్గేట్ దగ్గరే ప్రియాంకను హత్యచేసినట్లు తేల్చారు..టోల్గేట్ పక్కన ఉన్న కాంపౌండ్లో ఆమె వస్తువులు గుర్తించారు.. ప్రియాంక లోదుస్తులు, చెప్పులు, మందుబాటిల్ స్వాధీనం చేసుకున్నారు. లారీలు అడ్డంపెట్టి అత్యాచారం చేసినట్లు తేల్చారు. ఆ తర్వాత కర్నూలు హైవే మీదుగా దుండగులు పరారైనట్లు అనుమానిస్తున్నారు.. క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్తో ఘటనాప్రాంతంలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.