ఓవైపు డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటన షాక్ నుంచి తేరుకోకముందే.. హైదరాబాద్ హిమాయత్నగర్లో మరో యువతి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న మౌనిక అదృశ్యమైంది. ఆమె గౌడ హాస్టల్లో ఉంటోంది. మౌనిక స్వస్థలం నిజామాబాద్ జిల్లా. అదే జిల్లాకు చెందిన సాయన్న అనే యువకుడు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ నోట్ రాసి కనిపించకుండా పోయింది.