సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా ఉంటుంది. అయితే ఈసారి పంచాయితీ ఎన్నికలతో మరింత సందడి ఏర్పడనుంది. ఏపీలో సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. డిసెంబరు 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో వచ్చే జనవరి 10 న రిజర్వేషన్ల జాబితా ఖరారు అవకాశం ఉంది. అలాగే జనవరి 11 తేదీనుంచి పంచాయితీ ఎన్నికల కోడ్ అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు.