ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్యూఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుల దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ ప్రియాంకారెడ్డి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రియాంకను హత్య చేసిన నిందితులను సమాజంలో బతనివ్వొద్దన్నారు. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.