గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కోవెలమూడి గ్రామంలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సెల్ఫోన్లో స్టేటస్ అసభ్యకరంగా పెట్టారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు.. టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. వైసీపీ దాడుల్లో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా.. గొడవ విషయం తనకు తెలియదంటూ చెప్పుకొస్తున్నారు స్థానిక ఎస్ఐ.