తెలుగు భాషను ఏపీ ప్రభుత్వం చంపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్కూల్స్లో 8 భాషా మాథ్యమాలు ఉంటే తెలుగు పైనే ఎందుకు కక్ష కట్టారని ప్రశ్నించారు. తెలుగు బాషాభిమానులు, సాహితీవేత్తలు, కోవిదులతో కలిసి తిరుపతిలో పవన్ కల్యాణ్ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఓట్ల కోసం కాకుండా మన సంస్కృతి, భాషను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు హీరోల్లో చాలా మందికి తెలుగు రాయలేరు, చదవలేని పేర్కొన్నారు.