దిశ హత్యకేసు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోవడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.. దిశకు నివాళిగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.. శంషాబాద్లోని నక్షత్ర విల్లా కాలనీ వాసులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు, మహిళలతోపాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులంతా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల ప్రజలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులను అభినందిస్తున్నారు.